గ్రామీణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు చేస్తోంది. అందులో భాగంగా క్లస్టర్ వ్యవస్థ రద్దు చేసి.. పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. వీటిని నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించింది. పంచాయతీ కార్యదర్శులను.. పంచాయతీ అభివృద్ధి అధికారులుగా (పీడీఓ) మార్చింది. జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులతో పాటు కొత్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సంస్కరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపగా.. తాజాగా అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.