Andhra Pradesh Inter Tenth Toppers Cash Award: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించనుంది. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తారు. అదేవిధంగా, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని అసంపూర్తి తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.