ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గంతలో 'లీప్' (LEAP) పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన నిడమర్రు జడ్పీ పాఠశాలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ స్కూల్లో రూ. 14 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు.