ఏపీ ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీల నిర్మాణంపై వడివడిగా అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రైవేట్ భవనాలలో నడుస్తున్న పది పాలిటెక్నిక్ కళాశాలలకు త్వరలోనే కొత్త భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో రెండుచోట్ల ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యాయని.. మరో ఐదు చోట్ల భూములు కేటాయించామన్నారు. మిగతా మూడుచోట్ల త్వరలోనే భూములు కేటాయించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు.