NTR Bharosa Pension Scheme Distribution Changes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి రూ.2,717.88 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63.13 లక్షల మందికి మే ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మాత్రం పంపిణీ మే 3న జరుగుతుంది. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. అర్హులైన మహిళలు తమ వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించి మే 1 నుంచి పింఛన్ పొందవచ్చు.