Ntr Bharosa Pension Scheme Cancellation Notice: ఎన్టీఆర్ భరోసా పథకం కింద అనర్హులైన దివ్యాంగులు, ఆరోగ్య పింఛనుదారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగిస్తోంది. పింఛన్లలో అక్రమాలు జరిగాయని గుర్తించి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జనవరి నుండి తనిఖీలు నిర్వహించి, అనర్హులకు నోటీసులు జారీ చేస్తున్నారు. వైకల్యం 40 శాతం కన్నా తక్కువ ఉన్నవారి పింఛన్లు రద్దు కానున్నాయి. ఈ ప్రక్రియను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.