Ntr Bharosa Pension Scheme 2025 Appeal Procedure: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై దృష్టి సారించింది. అనర్హుల పింఛన్లు రద్దు చేస్తూ, అర్హులకు న్యాయం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దివ్యాంగుల పింఛన్ రద్దు అయినా, వితంతువులకు వితంతు పింఛన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వృద్ధాప్య పింఛనుకు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మారుస్తున్నారు. వైకల్యంపై సందేహాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుండి మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.