Ntr Bharosa Pension Scheme 2025 In Eligible Request: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆరోగ్య, దివ్యాంగుల పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులైన పింఛనుదారులకు నోటీసులు జారీ చేస్తోంది. అర్హత కలిగిన వారు అప్పీల్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వైకల్యం 40 శాతం కన్నా తక్కువగా ఉంటే పింఛన్ రద్దు చేస్తారు. అయితే, వితంతు పింఛనుకు అర్హత ఉన్నవారికి ఆ పింఛను మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియ ఈ నెల 25 నాటికి పూర్తవుతుంది.