Ntr Bharosa Pension Scheme 2025 Update: ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. అర్హులైన 65 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని, ఎటువంటి రద్దులు జరగలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నకిలీ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందిన అనర్హులకు మాత్రమే నోటీసులు జారీ చేశామని, అర్హులైన దివ్యాంగులను వృద్ధాప్య పింఛన్లోకి మారుస్తున్నామని తెలిపారు. తొలగింపు నోటీసులు పొందినవారు సరైన పత్రాలు చూపి పింఛన్ను తిరిగి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.