NTR Bharosa Pension Scheme L1 Scanner: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల విషయంలో అక్రమాలను నియంత్రించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. పింఛన్ల పంపిణీ కోసం ఎల్-1 స్కానర్లను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే వీటిని ఆయా గ్రామ సచివాలయాల సిబ్బందికి పంపిణీ చేయగా.. ఏప్రిల్ నెల నుంచి వీటి సాయంతోనే పింఛన్లు అందిస్తారు.