Chandrababu Review On Fuel Shortage: రాష్ట్రంలో ఇంధన కొరతతో పెట్రోల్ బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పలు జిల్లాల్లో బంకులు మూసివేత, అక్కడి పరిస్థితులపై అధికారులతో చర్చించారు. వెంటనే ఇంధన కొరత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంధన డీలర్లు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని సూచించారు. అలాగే కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నారు.