ఏపీ ప్రభుత్వం ఆగస్ట్ 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ మొత్తం నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆగస్ట్ 25న తొమ్మిది జిల్లాలలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులను పూర్తిగా ఉచితంగా.. ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లు మంత్రి మనోహర్ వివరించారు.