AP PMAY-G Beneficiary Survey Extended To November 30: సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ (PMAY-G) పథకం కింద అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తున్నారు. దరఖాస్తు గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. ఆధార్, రేషన్ కార్డు, ఇంటి పట్టా వంటి పత్రాలతో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.