ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది. ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 15 వరకూ మొత్తం నాలుగు విడతల్లో వీటిని జిల్లాలలో పంపిణీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ కోసం నిధులు విడుదల చేసింది. ఒక్కో స్మార్ట్ రేషన్ కార్డు తయారీకి గానూ రూ.4.66 ఖర్చు చేస్తోంది.