Andhra Pradesh 4018 Charging Stations: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 'పీఎం ఈ-డ్రైవ్' పథకం కింద 4,018 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారుల వెంబడి ఈ కేంద్రాలు రానున్నాయి. రూ.385.57 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. డిస్కంలు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యతను తీసుకుంటాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.