Ap Govt LEAP App Attendance Key Changes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ల హాజరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొందరు టీచర్లు స్కూల్ ఎగ్గొట్టి సొంత పనులకు వెళ్తున్నారని ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ కొత్త విధానం తెచ్చింది. ఇకపై స్పెషల్ డ్యూటీకి వెళ్లాలంటే లీప్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. డీడీవో అనుమతితోనే హాజరు వేస్తారు. లేదంటే శెలవు పెడతారు. దీనివల్ల టీచర్లు పాఠశాలలకు డుమ్మా కొట్టకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది.