Andhra Pradesh School Students Infosys Free Tabs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇన్ఫోసిస్తో కలిసి 'ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్' కార్యక్రమాన్ని ప్రారంభించి, టెక్నాలజీలో నైపుణ్యం పెంచే లక్ష్యంతో మంగళగిరి నియోజకవర్గంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ ట్యాబ్ల ద్వారా 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో పాఠాలు బోధించనున్నారు.