ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖ, సూర్యలంక బీచ్లలో వీటిని ఏర్పాటు చేసింది. బీచ్ షాక్స్ ఏర్పాటుపై ఏపీ ఎక్సైజ్ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 2029 ఆగస్ట్ వరకూ వీటిని ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీటీడీసీ గుర్తించిన ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయనుంది.