ఏపీలో అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2024లోనూ వంతెన దెబ్బతినడంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పుడు అది కూడా ధ్వంసం కావడంతో శాశ్వత వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. విజయవాడలోనూ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.