బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు భారీ వానల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల కోసం 16 జిల్లాలకు కోటి చొప్పున నిధులు కేటాయించారు.