ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో మంగళవారం కూడా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. స్కూళ్లకు సెలవులపై పరిస్థితిని అనుసరించి అధికారులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.