Vinukonda Magnitude Earthquake: పల్నాడు ప్రాంతంతో పాటుగా ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు వణికించాయి. ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది.. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. భూమి కొన్ని సెకన్ల పాటూ కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ భూకంప కేంద్రం వినుకొండకు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో ప్రకాశం, పల్నాడు జిల్లాలకు సరిహద్దులో భూ ప్రంకపనలు వచ్చాయి.