Andhra Pradesh Liquor Shops Permit Rooms: ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల దగ్గర పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. బహిరంగంగా మద్యం సేవించడం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం షాపుల పక్కనే ఈ గదులు ఉంటాయి. త్వరలో లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీని ద్వారా మందుబాబుల కష్టాలు తీరనున్నాయి.