ఏపీలో మరో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం కొత్తగా ఐదు ఎయిర్పోర్టులు నిర్మించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంల ఏడు ఎయిర్పోర్టులు ఉండగా.. మరో ఏడుచోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలోనే ఐదు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం త్వరలోనే ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు.