ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుంది. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురాన్ని తప్పకుండా జిల్లా కేంద్రం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు.