Vijayawada Nagpur Expressway Land Acquisition: నాగ్పూర్ వరకు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులో ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ ఆలస్యం కావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఖమ్మం జిల్లాలో పనులు జరుగుతున్నప్పటికీ, ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ జాప్యం కారణంగా ఏడాది కిందటే మొదలుకావాల్సిన పనులు ఇంకా మొదలు కాలేదు. అధికారులు భూసేకరణను వేగవంతం చేసి బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే రెండేళ్లలో హైవే అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.