Adarana 3 Scheme 2025 Implement Rs 1000 Crores: ఆదరణ-3 పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. చేతి, కుల వృత్తుల వారికి ఆధునిక యంత్రాలు, పరికరాలు అందించి వారి ఆదాయాన్ని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. లబ్ధిదారుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ, నాణ్యమైన పరికరాలను వారే ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.