Vijayawada West Bypass Road Krishna River Bridge Vehicles Allowed: అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణా నదిపై కొత్తగా నిర్మించిన వంతెనను తాత్కాలికంగా తెరుస్తున్నారు, దీని ద్వారా విజయవాడ ప్రజలు సభా వేదికకు త్వరగా చేరుకోవచ్చు. ప్రజల కోసం రవాణా, వసతి సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.