ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రూ.647 కోట్లతో నిర్మించిన సీఎస్పురం నుండి సింగరాయకొండ వరకు 90 కిలోమీటర్ల జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా కందుకూరు ప్రాంతంలో రోడ్ల విస్తరణకు రూ.9.6 కోట్లు మంజూరు చేయడంతో పాటు, జిల్లాలోని పలు గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రూ.25.24 కోట్లు కేటాయించారు.