ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. 2800 ఎకరాల్లో స్పేస్ సిటీ.. తొలి విడత ప్రారంభం అప్పుడే..

1 month ago 6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కానుంది. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ వద్ద 2800 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అయితే స్పేస్ సిటీ ప్రాజెక్టు తొలి విడత ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరో రెండు నెలల్లో తొలివిడతను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తొలి విడతలో 570 ఎకరాలలో కోర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మొదలు పెడతారు. ఈ ప్రాజెక్టుతో తిరుపతి జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు చెప్తున్నారు,.
Read Entire Article