Odisha RTC Bus Catches Fire In Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ఆగడం లేదు. కర్నూలు, చేవెళ్ల ఘటనల తర్వాత ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై అందరినీ దింపేశారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.