తెలుగు రాష్ట్రాలలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. జూబ్లీనగర్ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు తెలిసింది. పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.