ఏపీలో మరో విషాదం.. స్వర్ణముఖి నదిలోకి ఈతకు వెళ్లి..

6 months ago 12
తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మొత్తం ఏడుగురు యువకులు ఈతకు వెళ్లగా.. ప్రమాదవశాత్తూ నదిలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురిని స్థానికులు రక్షించగా.. నలుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు వెళ్లి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article