ఏపీలో మరో హామీ అమలుకు డేట్ ఫిక్స్..! టీడీపీ ట్వీట్

1 year ago 23
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కూటమి సర్కారు మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా పలు హామీలు ఇచ్చింది. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి సంయుక్తంగా మ్యానిఫెస్టో విడుదల చేశాయి. ఈ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే మరో హామీని అమలు చేసేందుకు కూటమి సర్కారు నిర్ణయించిందని.. టీడీపీ తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందంటూ టీడీపీ వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది.
Read Entire Article