Anakapalle Atchutapuram Road Expand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ చేపట్టింది. మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 13.8 కిలోమీటర్ల మేర రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు రూ.250 కోట్లు కేటాయించారు. అయితే, భూములు కోల్పోతున్న 1,200 మంది నష్టపరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకే పనులు చేపడతామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.