AP Weather Today:ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం కురిసిన వర్షాలకు ఏడుగురు మృతి చెందగా, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.