వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికలకు ముందు ఈ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్ర అని పేరు కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ పాదయాత్రను 2027లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి.. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.