బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన విద్యాసంస్థలను ఏపీకి కూడా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది తిరుపతి, విశాఖపట్నంలో మల్లారెడ్డి కాలేజీలను కొనుగోలు చేశారు. తాజాగా తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు తెలిపారు.