ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూటమి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు అప్పుడు, ఇప్పుడు అంటూ ఆలస్యం అవుతుండగా.. తాజాగా స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటన వెలువరించారు. తాజాగా కర్నూలులో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఆగస్ట్ 15వ తేదీ నుంచి.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.