మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా మహిళల స్వశక్తితో ఎగదాలని.. సొంతంగా పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద రూ. 50 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 10 లక్షల వరకు లోన్లు ఇస్తోంది. ఇలాంటి రుణాలపై 35 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. అంతేకాకుండా మహిళలు ఏర్పాటు చేసిన యూనిట్లలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు.. ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తోంది.