Andhra Pradesh Sewing Machine Free Distribution: ఏపీ ప్రభుత్వం మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గాలకు చెందిన లక్షమందికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రకాశం జిల్లా మార్కపురంలో జరిగే కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ మంత్రులు వివరాలను వెల్లడించారు.