ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధిలో రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజల రాకపోకలతో పాటు సరకు రవాణాకు ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో అదనపు రైల్వే లైన్లకు కేంద్రం ప్రణాళికలు రూపొందించగా నిధులు మంజూరు అయ్యాయి. అందులో మూడు, నాలుగో లైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాయగడ్ (ఝార్సుగూడ) నుంచి విజయనగరం వరకు మూడో లైన్, కొత్తవలస నుంచి విజయనగరం వరకు నాలుగో లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ లైన్లు అందుబాటులోకి వస్తే.. ఈ మార్గాల్లో మరిన్ని రైళ్లు నడిచే అవకాశం ఉంది. తద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.