Andhra Pradesh Farmers Shivraj Singh Chouhan Decision: ఏపీలో మిర్చి రైతుల సమస్యపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. చంద్రబాబుతో చర్చల తర్వాత చౌహాన్ తన అధికారులతో సమీక్షించారు. ఈ సమస్యపై ఇవాళ ఉదయం 11 గంటలకు ఉన్నతాధికారుల స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి.. ఒక స్పష్టతకు వచ్చి.. చర్యలను ప్రారంభిస్తామని చంద్రబాబుకు చౌహాన్ హామీ ఇచ్చారు.