AP Municipal Workers Strike: ఏపీలో మున్సిపల్ కార్మికులు జీతాల అంశంపై సమ్మెకు పిలుపునిచ్చారు. మార్చి నెల జీతాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. కార్మికుల సమ్మె కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెత్త సేకరణ, మురుగునీటి పారుదల పనులు ఆగిపోయే అవకాశం ఉంది. తమ సమస్యల్ని పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.