ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. డీఎస్సీ మెరిట్ జాబితాల విడుదలకు రంగం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపట్నుంచే వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాల్ లెటర్లు అందిన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించారు. ఇక ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని విద్యాశాఖ హితవు పలికింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.