Andhra Pradesh PMEGP Scheme Rs 1 Lakh To Rs 50 Lakh: ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎంఈజీపీ పథకం ద్వారా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తున్నాయి. 2026 వరకు అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా రూ. లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు రుణం పొందవచ్చు. 18 ఏళ్లు నిండి, 8వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులు, స్వయం సహాయక బృందాల వారు అర్హులు. పట్టణ ప్రాంతాల్లో 25%, గ్రామీణ ప్రాంతాల్లో 35% రాయితీ లభిస్తుంది. ఆసక్తి గలవారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.