నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒరాకిల్, ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ క్లౌడ్ ట్రైనింగ్ ద్వారా మొదటి సంవత్సరం లక్ష మందికి, ఆ తర్వాత రెండేళ్లలో ఒక్కో ఏడాది లక్షన్నర మందికి ఉచిత శిక్షణ లభిస్తుంది. ష్నైడర్ ఎలక్ట్రిక్ 2027 నాటికి 20 ట్రైనింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి తొమ్మిది వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మంగళగిరిలో రూ.15 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీ రెండు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ వివరాలు..