సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్ల విస్సన్నపేట మండలంలోని అమ్మమ్మ ఇంట్లో మధుమతి ఉరి వేసుకుని కనిపించడం కలకలం రేపింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు అధారంగా పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మధుమతి మరణానికి ప్రతాప్ అనే వ్యక్తి కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.