ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని.. ఇకపై ప్రజలతోనే తన ప్రయాణమని ఆమె ప్రకటించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేదానిపై తాజాగా ఆశా కిరణ్ స్పష్టతనిచ్చారు. వచ్చే మూడేళ్ల పాటు తన సేవా కార్యక్రమాలు, పనితీరును అందరూ చూస్తారని.. ఆ తర్వాత రాధా రంగ మిత్ర మండలి పెద్దల సూచలన మేరకు రాజకీయ నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే జకీయాల్లోకి రావడం లేదని, ఏ పార్టీలో చేరడం లేదన్నారు.