ఆంధ్రప్రదేశ్లో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కర్నూలు జిల్లా నగరడోనలో గరిష్టంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా 172 మండలాల్లో 41 డిగ్రీల పైన వేడి కొనసాగుతోంది. ఆదివారం 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.